దివ్యాంగుల హక్కుల చట్టం వెంటనే అమలు చేయాలి

గుంటూరు జిల్లా, బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఉన్న దివ్యాంగుల అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, పెద్ద వారందరూ కూడా మానవ హక్కుల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, అలాగే రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల అందరికి పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరడం జరిగింది. పైన ఉన్న ఈ రెండు అంశాల మీద వెంటనే స్పందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘాల నాయకులు కంది వెంకటరెడ్డి, దేవిరెడ్డి శ్రీనివాసరావు, పసుపులేటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.