గుంతకల్ నియోజకవర్గం, గుత్తి పట్టణం నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మార్చ్ 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్లను గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాసగిరి మణికంఠ జనసేన నాయకులతో కలిసి ఆవిష్కరించడం జర్గింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గంలోని మూడు మండలాలు (పామిడి, గుత్తి, గుంతకల్) నుండి జనసేన శ్రేణులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ పిఠాపురం ఆవిర్భావ సభ పైనే యావత్ దేశం చూపు ఉందని, నూతనోత్సాహంతో ఆవిర్భావ దినోత్సవానికి తరలి వెళ్లేందుకు వీర మహిళలు, జనసేన నేతలు, జనసైనికులు సన్నద్ధమవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు పోతురాజుల చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్ జనసేన సీనియర్ నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య, గోరంట్ల నాగయ్య రాయల్, వెంకటపతి నాయుడు, మిద్దె ఓబులేసు, హసన్, రామంజి, గుజిరి రామంజి, అమర్, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment