కుప్పంలో ఉద్రిక్తత…మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అరెస్ట్ !

చిత్తూరు జిల్లాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్నాథ్ రెడ్డితోపాటు.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.ఓ హోటల్ లో బస చేస్తుండగా అరెస్ట్ చేశారు పోలీసులు. కుప్పంలో నామినేషన్స్ సందర్భంగా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. మొత్తం 19 మంది పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఇద్దరినీ మాత్రమే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.ఐపీసీ 143, 147,353, 427,149 సెక్షన్స్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 11 ఉదయమే డీసీపీ నామినేషన్ వివాదం పై మీడియాతో మాట్లాడారు. ఇతర జిల్లాలవారి కారణంగానే గొడవలు జరుగుతున్నాయని అని అన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమీషనర్ చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అమర్నాథ్ రెడ్డిని, పులివర్తి నానిని అరెస్ట్ చేశారు. దాంతో పోలీస్ స్టేషన్ ముందు తెలుగుదేశం కార్యకర్తలు గందరగోళం సృష్టిస్తున్నారు.