రైతులకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని పితాని డిమాండ్

ముమ్మిడివరం, జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం కొత్తలంక, చిన కొత్తలంక, మర్లపాలెం, కర్రివానిరేవు గ్రామాలలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు పంటనష్టపోయిన పంట పొలాలను, ధాన్యం రాశులను పరిశీలించారు. రైతులకు వెంటనే పంట నష్టపరిహారం 20 నుండి 25 వేలు ఇప్పించాలని, పంట భీమా వర్తించేలా చూడాలని 75 కేజీలు 1637 సాధారణ రకం, ఏ గ్రేడ్1652 బేషరతుగా కొనుగోలు చెయ్యాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. అలాగే మురుగు కాలువలకు పూడికలు వెంటనే తీయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.