అవినీతిపరులపై పోరాటమే అసలైన దేశభక్తి
ప్రస్తుత పరిస్థితుల్లో అవినీతిపరులపై పోరాటమే అసలైన దేశభక్తి అని జనసేన పార్టీ నాయకులు వబ్బిన సత్యనారాయణ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎస్.కోట నియోజకవర్గంలో సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎస్.కోట జంక్షన్, ఎల్.కోటలో పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వబ్బిన సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో జనసైనికులు ప్రజా సేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. మెరుగైన సమాజం కోసం పవన్ కల్యాణ్ రాజకీయ పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు సుంకరి అప్పారావు, గొరపల్లి రవికుమార్, గొరపల్లి చినబాబు, జొన్నపల్లి సత్తిబాబు, మల్లువలస శ్రీను, ఎం.చిన్ని, చంటి, పి.సురేష్ రాజు, నక్కరాజు సతీష్, గురజాడ వెంకటేష్, దాలిబోయిన రాజు, గొరపల్లి వెంకటరావు, రుద్ర, ఇర్ర వెంకటలక్ష్మి, గాలి అప్పారావు, గోకాడ సూర్యనారాయణ, కోలా మధు, రాంబాబు, పెంటకోట శ్రీను, సుంకర శివకృష్ణ, గబ్బర్ సింగ్, బోగాది దేవా, జనసైనికులు పాల్గొన్నారు.