జనసేనతోనే భవిష్యత్తు: మాకినీడి శేషు కుమారి

పిఠాపురం, జనసేనతోనే భవిష్యత్తుని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం గొల్లప్రోలు ఈబీసీ కాలనీ19 వ వార్డులో గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ వినుకొండ శిరీష ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన లింగంశెట్టి వీర వెంకట రమణ పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మంది యువకులు పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారిని ఆహ్వానించి వారి సమక్షంలో కండువా కప్పించుకుని జనసేన పార్టీ లోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్బంగా శేషు కుమారి మాట్లాడుతూ వీర వెంకటరమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. యువకులు జనసేన పార్టీలోకి రావడం అభినదనీయంన్నారు. రానున్న రోజుల్లో పిఠాపురం కంచుకోటన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ వినుకొండ శిరీష, గొల్లప్రోలు రూరల్ మహిళా ప్రెసిడెంట్ వినుకొండ అమ్మాజీ, పిఠాపురం టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాశరావు, గొల్లపల్లి గంగ, వెలుగుల లక్ష్మణ్, పెద్దింటి శివ, గొల్లప్రోలు పట్టణ జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.