పర్యావరణ పరిరక్షణే లక్ష్యం

*ఐ.పంగిడిలో అవగాహన ర్యాలీ

కొవ్వూరు నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్చాంద్ర – స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా, కొవ్వూరు నియోజకవర్గంలోని ఐ.పంగిడి గ్రామంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరిసరాల శుభ్రత, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాలు, అలాగే ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల ఏర్పడే పర్యావరణ కాలుష్యంపై అవగాహన కల్పించారు. విద్యార్థులతో కలిసి వారి తల్లిదండ్రులకు కూడా ఈ సమాచారం చేరేలా చర్యలు తీసుకున్నారు. సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, గ్రామ చైర్మన్, వైస్ చైర్మన్ పెరుగు శివ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు ముందుగా ప్రతిజ్ఞ చేశారు, అనంతరం గ్రామ సెంటర్ వరకు ర్యాలీగా ప్రయాణించి, మానవహారం రూపంలో గ్రామస్థులకు పర్యావరణ పరిరక్షణపై సందేశం అందించారు. ప్రతి నెల మూడవ శనివారం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయని, పౌరులందరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించి 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పడాలని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, ఉపాధ్యాయులు, జనసేన పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు చురుకుగా పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-04-19-at-8.21.20-PM-1024x768 పర్యావరణ పరిరక్షణే లక్ష్యం

Share this content:

Post Comment