విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ప్రభుత్వ తీరు నిమ్మకు నీరెత్తినట్లుంది

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వ్యవహారంలో వైసీపీ తీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందని జనసేన పార్టీ గిద్దలూరు ఇంఛార్జ్ శ్రీ బెల్లంకొండ సాయిబాబు స్పష్టం చేశారు. ఎంతో మంది బలిదానాలతో సిద్ధించిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడిపై ఉందన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్ లో సేవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పేరిట డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. #Raise_Placards_YSRCP_MP హ్యాష్ ట్యాగ్ తో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ లంకా నరసింహరావు, జిల్లా సహాయ కార్యదర్శులు శ్రీ కాల్వ బాలరంగయ్య, శ్రీ గజ్జల్ల కొండ నారాయణ, కంభం మండల నాయకులు శ్రీ తాడిశెట్టి ప్రసాద్, శ్రీ సందు నారాయణ, శ్రీ షేక్ అజ్జు, శ్రీ దండే నాగార్జున, రాచర్ల మండల నాయకులు శ్రీ ఇప్పల శేషాద్రి, శ్రీ పుట్ట బాలకృష్ణ, శ్రీ అలిశెట్టి వెంకటేశ్వర్లు, శ్రీ ఏలం పుల్లారావు బెస్తవరపేట మండల నాయకులు శ్రీ పిడతలసాయి, శ్రీ ఒనిపెంట జీవన్, అర్ధవీడు మండల నాయకుల కార్యకర్తలు పాల్గొన్నారు.