న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన న్యాయవాదుల హత్యపై హైకోర్టు స్పందించింది. న్యాయవాదుల హత్యను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. హత్యోదంతంపై పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు సూచించింది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని తెలిపింది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. న్యాయవాదుల హత్య తీవ్ర గర్హనీయమని హైకోర్టు మండిపడింది. హత్య కేసులో నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని హైకోర్టు చెప్పింది. న్యాయవాదుల హత్య అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను మార్చి 1కి వాయిదావేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.