జనసైనికుడికి అండగా జనసేన పార్టీ
చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం, సుందరరావుపేట గ్రామంలో జనసైనికుడు కూచింపూడి సన్నీ తండ్రి కూచింపూడి బాలస్వామి మృతికి సంతాపం తెలియజేసి, లింగపాలెం మండలం జనసేన నాయకుల సహాకారంతో జనసేన పార్టీ తరపున 6000/- రూపాయలు నగదు, ఒక రైస్ బ్యాగును సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల అధ్యక్షులు పంది మహేష్ బాబు, మాజీ మండల ప్రెసిడెంట్ మాదాసు కృష్ణ, మండల ఉపాధ్యక్షుడు తాళం మల్లేశ్వరరావు, మండల కార్యదర్శి పొదిల మహేష్, నాయకులు పొదిల జేమ్స్, కూచింపూడి గణేష్, తాణంకి విద్యాసాగర్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-27-at-19.48.48-1024x768.jpeg)