అతికారి దినేష్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన జనసేన క్రికెట్ పోటీలు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం: సంక్రాంతి పండగ సందర్భంగా మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ ఆధ్వర్యంలో సుండుపల్లి వీరబల్లి మండలాలలో జరిగిన క్రికెట్ పోటీలు ఘనంగా ముగిసాయి. దాదాపు 25 జట్లు పాల్గొన్న ఈ క్రికెట్ పోటీలలో ఫైనల్ లో రాయవరం టీంతో చిన్నగొల్లపల్లి తలపడగా రాయవరం ఫైనల్ లో ఘన విజయం సాధించి జనసేన పార్టీ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ చేతులమీదుగా విజేతగా నిలిచిన రాయవరం టీం కు 30 వేల రూపాయలు మరియు జనసేన పార్టీ టోర్నమెంట్ కప్పును అందజేశారు. అలాగే రన్నరఫ్ గా నిలిచిన చిన్నగొల్లపల్లి టింకు 15వేల రూపాయలు బహుమతిని అందజేశారు. ఫైనల్ మ్యాచ్ మరియు టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా రాణించిన ఆటగాడు షేక్ ఆప్రూజ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మాన్ అఫ్ ది సీరియస్ గా ఎన్నిక చేసి ట్రోఫీ బహుమతిని అందజేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో టోర్నమెంట్ అద్భుతంగా నిర్వహించిన ఆర్గనైజర్స్ ఆర్. హరి, అర్జున్, వి .వెంకటరమణ, ఎల్.రవీంద్ర, ఆర్. వెంకటేష్ లను ఘనంగా సత్కరించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి.సుండుపల్లి వీరబల్లి, మండల నాయకులు గుగ్గిళ్ళ నాగార్జున, జిగిలి ఓబులేసు, సుధారాణి, రూప, కిషోర్, గోపాల్, గోపిక్రిష్ణ డా. వెంకయ్య, డా. రమణ, బోడిగోలా రమణ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.