దివ్యాస్త్రం పుస్తకాన్ని హరి ప్రసాద్ కు అందించిన జనసేన నాయకులు

విజయనగరంలో జనసేన పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చెయ్యడం కోసం జనసేన పార్టీ నాయకులు విసినిగిరి శ్రీనివాసరావు ఎంతో కృషి చేస్తున్నారు. ఇటీవల జనసేన పార్టీ నిర్వహించిన జగనన్న ఇల్లు పేదలందరికి కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా గుంకాలంలో దాదాపు 12,000 జగనన్న ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి.. తీరా అధికారంలోకి వచ్చి దాదాపుగా 4 సంవత్సరాలు అవుతున్నా.. నేటికీ కూడా జగనన్న ఇళ్ళు మొదలు పెట్టి పూర్తి చెయ్యలేకపోయారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 31 లక్షల మందికి జగనన్న ఇల్లు ఇస్తాను అని మాటిచ్చి.. నేటికీ వారు చెబుతున్న లెక్కల ప్రకారం 1 లక్ష 60 వేల ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. కానీ నిజానికి జగనన్న ఇల్లు నిరుపేదలు ఎవ్వరికి అందలేదు. ఈ విషయంపై రేపాక నాగేశ్వరరావు ఈ పేదోడికి ఇల్లు మీద, వైసీపీ పార్టీ అవినీతిని తన 4వ పుస్తకం దివ్యాస్త్రం పుస్తకం ద్వారా విడుదల చేసారు. ఇదే విషయాన్నీ జనసేన పార్టీ మీడియా విభాగం హెడ్ హరి ప్రసాద్ కు చెప్పి, దివ్యాస్త్రం పుస్తకాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా హరి ప్రసాద్ ఈ రాష్ట్ర నలు మూలలకు దివ్యాస్త్రం పుస్తకాలు చేరేలాచూస్తానన్నారు.