జనసేన కుటుంబానికి జనసేన పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది: గాదె

  • జనసేన నాయకులు డికొండ వేణు కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ

గురజాల నియోజకవర్గం, గురజాల మండలం, పల్లెగుంత గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు డికొండ వేణు అకాలమరణం చెందినారు. విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్ రావు, నియోజకవర్గం నాయకులు, జనసైనికులతో చర్చించి ఆ కుటుంబానికి 1,00,000/- ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ప్రతి జనసేన కుటుంబానికి జనసేన పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.