రహదారులను వెంటనే నిర్మించాలి గలమెత్తిన జనసేన నాయకులు

#GoodMorningCMsir

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కమ్మంసిగడాం నుండి దేవరాపిల్లి వరకు వెల్లి రోడ్లు చాలా అధ్వాన్నంగా తయారు అయ్యింది. ప్రజలకు కావలసిన మౌళిక సదుపాయాలు కల్పించకుండా మాటలు దాటవేస్తు రహదారులు దుస్థితిని పట్టించుకోని ప్రభుత్వం వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు శనివారం ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు రోడ్లు సమస్యలపైన గలమెత్తారు. రోడ్లు సమస్యను పవన్ కళ్యాణ్ గారు దగ్గరకి చేరే విధంగా రోడ్డు మార్గంలో రోడ్లు అధ్వాన పరిస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ జరిగింది. ఇప్పుడు ఉన్న వైసిపి ప్రభుత్వం మరియు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదాలు ప్రజలు చాలా విధాలుగా గమనిస్తున్నారు ఆచుట్టు ప్రక్కల 5గ్రామాలకు ఆరోడ్డు పై ప్రయానించడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలు చాలా ఇక్కట్లు పడుతున్నారు, అలాగే గర్భిణీ స్త్రీలు అక్కడిక్కడే మధ్యలోనే డిలివరీ అయ్యే పరిస్ధితులు ఉన్నాయి. ప్రజలకు విద్య, వైద్యం, రహదారులు అవసరం కాబట్టి ఈఅన్యాయాన్ని జనసేన పార్టీ నాయకులు కృష్ణాపురం యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు ప్రభుత్వం పైన బలంగా ఎదుర్కొంటుంది అయన చెప్పారు. ఈ పర్యటన భాగంగా స్ధానిక ప్రజలు వర్షాకాలంలో మరింత సమస్యపూరితంగా ఉందని ఇన్ని ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈరోడ్లు సమస్యను ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు నిర్మాణాన్ని పూర్తి చేస్తారని జనసేనపార్టీ నాయకులు డిమాండ్ చేసారు, ఈ కార్యక్రమంలో మహాంతి రామస్వామి నాయుడు, గణపతి, అశిరినాయుడు, కోటేశ్వరరావు, ధనుంజయ్,జగదీష్,రవిచంద్ర, కామేశ్వరరావు, ఆనంద, కావ్య, అనిత, సంద్య తదితరులు పాల్గొన్నారు.