బత్తుల ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్న వైసీపీ, టీడీపీ నాయకులు

  • అధికార పార్టీ తీరు నచ్చక కలవచర్ల గ్రామంలో 2వ వార్డ్ మెంబెర్, 9వ వార్డ్ మెంబెర్ బలరామ్ నమ్మకంతో జనసేన పార్టీలో చేరారు

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, కలవచర్ల గ్రామంలో పలు పార్టీల నాయకులను రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివ రామ్, శ్రీకృష్ణపట్నం జనసేన పార్టీ సర్పంచ్ కిమిడి శ్రీరామ్, జనసేన పార్టీ సీనియర్ లీడర్ అడబాల అది విష్ణు, జనసేన పార్టీ సీనియర్ లీడర్ వేగిశెట్టి రాజు, నాతిపామ్ దొరబాబు, శ్రీకృష్ణపట్నం మణికంఠ, దేవన దుర్గా ప్రసాద్ కలవచర్ల జనసేన పార్టీ సభ్యులు, జనసేన పార్టీ యువత, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.