అంబటికి షాకిచ్చిన జనసైనికులు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. ఈ నేపధ్యం లో ఎమ్మెల్యేకు జనసైనికులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వరుస ట్రోలింగ్స్తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
అంబటి తన ట్వీట్లో.. ‘స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను స్వరాష్ట్రంలో జరుపుకోలేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందంటారా?’ అని అంబటి రాంబాబు ప్రశ్నించగా ఇక జనసైనికులు ఆగుతారా.. వెంటనే ట్వీట్లతో కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టారు. ఓ రేంజ్లో ఫైరవుతున్నారు.
అంబటి ట్వీట్ కు కౌంటర్ ట్వీట్ చేసిన అలేఖ్య రెడ్డి, అవినాష్:
స్వాతంత్ర్య దినోత్సవం అంటే రాష్ట్రానికి సంబధించింది అనుకునే మీ గొప్ప మేధావి బుర్రకి ధన్యవాదాలు. ఇంత గొప్పవాళ్ళు అందరూ ఒకే పార్టీలో ఉండటం అదృష్టం అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం అనేది దేశానికి సంబంధించినది.. దేశంలో ఎక్కడ ఉన్నా పరదేశంలో ఉన్నా జరుపు కోవచ్చు. ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఎమ్మెల్యే ఎలా అయ్యారు అంబటి గారు.. ఊరికే ఎవరొకరి మీద పడిపోవడం తప్ప అంటూ మండిపడ్డారు.
అంబటి ట్వీట్ కు కౌంటర్ ట్వీట్ చేసిన శివపార్వతి:
మరో జనసైనికురాలు తన ట్వీట్లో.. ‘అవునా మరి కరోనా ఆంధ్రా లో వొస్తే అక్కడే వైద్యం చేపించుకోవాలి కదా. మరి పక్క రాష్ట్రానికి ఎందుకు పారిపోయారు అండి’ అని ప్రశ్నించారు. అయ్యా అంబటి రాంబాబు గారు, అది ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కాదు ఆంధ్రప్రదేశ్ లోనే జరుపుకోవటానికి.. స్వాతంత్ర్య దినోత్సవం ఏ రాష్ట్రంలో అయినా జరుపుకోవచ్చు.. మీ చిల్లర రాజకీయాలు ఆపండి ఇకనైనా! అంటూ కౌంటర్ ఇచ్చారు.