సమస్యలపై పోరాడండి: పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు పెంకే కిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ముఖ్య అతిధులుగా పాల్గొని అందరికి దిశా నిర్దేశం చేసి, గ్రామ సమస్యలపై పోరాడండి, జనసేన పార్టీ సిద్ధాంతాలను, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి విరివిగా తీసుకువెళ్లాలని, ప్రజల కష్టాలు కొన్ని రోజులు మాత్రమే అని త్వరలో మన ప్రభుత్వం రాబోతోంది అని కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, రెడ్డిపల్లి కిషోర్, తాటికాయల వీరబాబు, గేదెల చిన్నారావు, గొల్లపల్లి రామకృష్ణ, అప్పారావు, భాను, వెంకటరమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.