వారాహి యాత్రతో వైసీపీ దుష్టపాలన అంతం

పూతలపట్టు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనహితం కోసం వైసీపీ దుష్టపాలన అంతం చేయడానికి, ప్రజాపాలన ప్రారంభానికి ఆరంభంగా అన్నవరం సత్యదేవుని ఆశీస్సులతో తలపెట్టిన “వారాహి విజయ యాత్ర” విజయవంతం కావాలని బుధవారం పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండల అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి యాదమరి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహించి “వారాహి విజయ యాత్ర” ఆద్యంతం దిగ్విజయంగా జయప్రదం కావాలని ప్రార్థించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వేముల పవన్, చంద్రా, వెంకటేష్, ప్రభాకర్ మరియు జనశైనికులు, వీరమహిలలు పాల్గొన్నారు.