డివిజన్ కేంద్రంలో ఫైర్ స్టేషన్ మంజూరుకై ఎమ్మెల్యే చొరవ చూపాలి

*డిగ్రీ కాలేజి జీవో తో పాటు ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని జనసేన పార్టీ డిమాండ్

స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మంజూరు పట్ల విద్యార్థుల తరుపున హర్షం వ్యక్తం చేస్తున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గాదె పృథ్వి అన్నారు. అదేవిధంగా డివిజన్ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే చొరవ చూపాలని కోరారు. డివిజన్ కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ హామీలకే పరిమితం కాకుండా అమలులో ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఫైర్ స్టేషన్ మంజూరుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాటలకే ఫైర్ స్టేషన్ పరిమితం అయిందని ఏద్దేవా చేసారు. ఫైర్ స్టేషన్ స్థానిక స్థానిక ప్రజల డిమాండ్ అని పేర్కొన్నారు. జనగామ జిల్లా మెడికల్ కాలేజ్ కోసం జనసేన పోరాటం చేసిందని తెలిపారు. ప్రజా ఉద్యమాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజా ఉద్యమాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు గౌడ్, వేదాంతం ఉదయ్, నామాల సిద్దు, మహమ్మద్ రజాక్, మునిగేలా పవన్, రచ్చ రవి, పోతకానూరి రాజు, మేడిద ప్రశాంత్, మహమ్మద్ బషీర్, రాజబోయిన రాజు, బోట్ల రాకేష్ తదితరులు ఉన్నారు.