తాటిప‌ర్తిలో జ‌న‌సైనికులపై దాడి అమానుషం

  • ప్ర‌జ‌ల తీర్పు సుస్ప‌ష్టం
  • భ‌విష్య‌త్తుకు భ‌రోసా ఇచ్చే కూట‌మికి ఓటు వేయాలి
  • జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌: దౌర్జ‌న్యాల‌తో, దాడుల‌తో, బెదిరింపుల‌తో అధికారంలోకి రావాల‌ని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌లలు కంటున్నార‌ని, ఇప్ప‌టికే ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌లు సుస్ప‌ష్ట‌మైన తీర్పుతో సిద్దంగా ఉన్నార‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్, ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పెంటేల బాలాజి చెప్పారు. ఆయ‌న కార్యాల‌యంలో బాలాజి విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జనసైనికులపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని, సినీ హీరో సాయి ధరమ్‌తేజ్‌ కాన్వాయ్‌ ముందుకు వెళుతున్న తరుణంలో గుర్తుతెలియని వ్యక్తి రాయి వెసిరార‌ని తెలిపారు. ఈ దాడుల్లో జ‌న‌సేనికులు గాయ‌ప‌డ్డార‌ని, ఇటువంటి చ‌ర్య‌లు ప్ర‌జాస్వామ్య స్పూర్తికి విరుద్ద‌మ‌ని ఖండించారు. సాయిధరమ్‌తేజ్‌ పర్యటనకు అనూహ్య స్పందన రావడంతో తట్టుకోలేక ఉక్రోషంతో వైసీసీ నాయ‌కులు దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. భ‌విష్య‌త్తుకు భ‌రోసా ఇచ్చే కూట‌మికి ఓటు వేయాలి వైసీసీకి ఓట‌మి ఖారారైంద‌ని, ఈ విష‌యం తెలిసే దౌర్జ‌న్యాల‌కు ప్ర‌లోభాల‌కు తెర‌తీసార‌ని బాలాజి తెలిపారు. చివ‌ర‌కు ఉద్యోగులు, ఉపాద్యాయుల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక‌త ఉంద‌ని తెలిసి పోస్టల్‌ బ్యాలట్‌ ఉపయోగించుకుంటున్న వారిని ప్రసన్నం చేసుకునేందుకు వైసీసీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ కరెన్సీ నోట్ల కట్టలతో గ్రామాల్లో ఓట్ల వేట మొదలుపెట్టారని, ముందుగానే నగదు సంచులను చేర‌వేస్తున్నార‌ని ఆరోపించారు. తిరిగి అడ్డ‌దారిలో అధికారంలో రావాల‌ని వైసీసీ అనేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని వివ‌రించారు. అధికారులు నిష్ప‌క్ష‌పాతం వ్య‌వ‌హ‌రించాల‌ని, వైసీసీ నాయ‌కుల ప్ర‌లోభాలను అడ్డుకొని, ఓట‌ర్లు భ‌యాందోళ‌ల‌కు లోను కాకుండా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఓటు వేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఓట‌ర్లు వైసీసీ ప్ర‌లోభాల‌కు లోను కాకుండా భ‌విష్య‌త్తుకు భ‌రోసా ఇచ్చే కూట‌మికి ఓటు వేయాల‌ని సూచించారు.