సేవకి మారుపేరు బొలియశెట్టి శ్రీకాంత్

*రంజాన్ సందర్భంగా ముస్లిం విలేకరులకు నిత్యావసర సరుకులు అందజేత

కొండపల్లి మున్సిపాలిటీ లో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బొలిశెట్టి శ్రీకాంత్ రంజాన్ మాసం పండుగ సందర్భంగా ముస్లిం విలేకరులకు శుక్రవారం తన నివాసంలో నిత్యావసర సరుకులను శ్రీకాంత్ సతీమణి విజయ దుర్గ, పిల్లలు అక్షయ, లోకేష్ చేతుల మీదగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు అందరూ.. సోదర భావంతో కలిసికట్టుగా జీవించాలని, కొందరు కావాలని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. అలాంటి వాటికి చెక్కుచెదరక ఐకమత్యంతో ప్రజలందరూ మెలగాలని.. సాటి మనిషికి అండగా నిలబడాలని.. సహాయం చెయ్యాలని శ్రీకాంత్ తెలిపారు. పవిత్ర మాసంలో తమకు అండగా నిలిచిన బొలియశెట్టి శ్రీకాంత్ కుటుంబానికి విలేకరులు ధన్యవాదాలు తెలిపారు.