గురుదత్ కి ఘనస్వాగతం పలికిన కొత్తవెలుగుబంధ గ్రామ ప్రజలు

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం,కొత్తవెలుగుబంద గ్రామంలో శ్రీశ్రీశ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత విశ్వేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్. కొత్త వెలుగుబంధ గ్రామ ప్రజలు ప్రేమతో గురుదత్ ని శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, పల్లా హేమంత్, చల్లా ప్రసాద్ కొత్తవెలుగుబంధ గ్రామ జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.