రాయలసీమ ప్రజలే మీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు

ధర్మవరం, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖ్యంగా మాట్లాడుతూ రాప్తాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభలో పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని రాయలసీమ కరువు పేరు చెప్పి రాయలసీమ ప్రజలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకెన్నిసార్లు మోసం చేస్తాడంటూ వాళ్లు నీ మోసాలన్నీ గ్రహించారని రాయలసీమ ప్రజలే మీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని రాయలసీమ యువత కోసం ఏం చేశావని సిద్ధం బహిరంగ సభ నిర్వహించావని యువత కోసం ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించావొ నువ్వు శ్వేతపత్రం విడుదల చేయాలని, అలాగే 57 నెలలలో నువ్వు సాధించిన అభివృద్ధి భూకబ్జాలు, రౌడీయిజం, గూండాయిజం, ఇసుక దందాలు మాత్రమేనని రాయలసీమ రైతులను నట్టేట ముంచాడని రాయలసీమ మహిళలను మోసం చేశావని, రాయలసీమ ప్రజలే మీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారనీ పేరుకు మాత్రం కులానికి ఓ కార్పొరేషన్లు పెట్టావు ఆ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు చేసింది శూన్యం మీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రోటోకాల్ కల్పించారని అలాగే ఈ సిద్ధం సభలో జగనన్న మందు, జగనన్న బిర్యాని, జగనన్న వెయ్యి రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.