కార్పొరేటర్ గోవింద్ రెడ్డి కొనియాడిన యారాడ గ్రామ ప్రజలు

గాజువాక, భారత రాజ్యాంగం ప్రదాత, ప్రపంచ స్ఫూర్తి దాత, బడుగు బలహీన వర్గ కీర్తి సంపన్నుడు, డా. బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా గాజువాక నియోజకవర్గం 64 వ వార్డు యారాడ గ్రామం జాషువా నగర్ పెద్దలు ఆహ్వానం మేరకు గురువారం ముఖ్య అతిధిగా 64 వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచానికి నాగరికత నేర్పించిన దేశం మన భారత దేశం మన దేశానికి అంబేద్కర్ రాజ్యాంగం రూపకల్ప అయినందుకు మనమందరము గర్వించాలని ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ… ప్రజలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును మనమందరము ఇవ్వాలని కార్పొరేటర్ గోవింద్ రెడ్డి సందేశాన్ని తెలియజేస్తూ ప్రజలే దేవుళ్ళు ప్రజా సేవే నాకు అంకితమని, ప్రజా పక్షాన నేనెప్పుడూ ఉంటానని ప్రజలతోనే నా ప్రక్రియ ఉంటుందని వార్డ్ అభివృద్ధి పనుల్లో నాకు అన్ని విధాలుగా సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తదనంతరం వార్డ్ లో ప్రజా అభివృద్ధి పనులపై ఆరా తీస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యారాడ గ్రామం పర్యటించారు. స్థానిక ప్రజలు యారాడ గ్రామానికి, మీరు చేస్తున్న పనులు చాలా అభినందనీయంగా ఉన్నాయని కార్పొరేటర్ గోవింద్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ సన్యాసి రావు, జి రమణ, బి రాము, అప్పారావు, సాయి కుమార్, నాగేష్, తోవిటయ్యా, జనసేన పార్టీ విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంటు అధికార ప్రతినిధి సిహెచ్ ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.