డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయాలని ప్రయత్నించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

ఖమ్మం జిల్లా నడిబొడ్డున జడ్పీ సెంటర్లో జరిగిన సంఘటన గూర్చి ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్ మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయుటకు ప్రయత్నించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు పీడి యాక్ట్ పెట్టి మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ విద్యార్థి విభాగం తరుపున డిమాండ్ చేస్తున్నామని, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన గుండాపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు వదలబోమని ఆయన హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ వారు కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.