కోనసీమ జిల్లాలో పలువురిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలువురిని సోమవారం జనసేన పార్టీ పిఏసి సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించారు. ముమ్మిడివరం మండలం, చింతలపూడి గ్రామానికి చెందిన మాదాల నరసింహారావు ఇటీవల మృతిచెందారు వారి కుమారుడు మాదాల బుజ్జి మరియు వారి కుటుంబ సభ్యులను, ముమ్మిడివరం నందు ఇటీవల మృతిచెందిన చిన్నారి కంచుస్థంభం అరణిక వారి కుటుంబసభ్యులను, ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడి గ్రామానికి చెందిన ఇటీవల మృతిచెందిన సానబోయిన నాగవేణి కుమారుడు రాంబాబు, వారి కుటుంబసభ్యులకు, ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడి గ్రామానికి చెందిన ఇటీవల మృతిచెందిన సానబోయిన రాందాసు వారి కుమారుడు సత్యనారాయణను, వారి కుటుంబసభ్యులను జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, జక్కంశెట్టి బాలకృష్ణ(పండు) ముత్యాల జయలక్ష్మి, పితాని రాజు, నూకల మూర్తి, విత్తనాల రవి, మాదాల లక్ష్మయ్య, మాదాల సత్తిబాబు మొదలగువారు పాల్గొన్నారు.