మత్స్యకార అభ్యున్నతి కోసం నరసాపురంలో జరిగే బహిరంగ సభ ను విజయవంతం చేయాలి

మత్స్యకార అభ్యున్నతి కోసం నరసాపురంలో జరిగే సభకు ముఖ్య అతిధిగా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ గౌరవ సలహాదారు నల్లా శ్రీధర్ పిలుపునిచ్చారు. అమలాపురం జనసేన పార్టీ ఆఫీస్ నందు నియోజకవర్గ నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమం లో మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, అయితాబత్తుల ఉమామహేశ్వర రావు అమలాపురం మున్సిపాలిటీ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను కంచిపల్లి అబ్బులు, నాగ మానస, బట్టు పండు, మండలాధ్యక్షులు లింగోలు పండు, పెమ్మడి శ్రీను, గంధం శ్రీనివాస్, పడాల నానాజీ, వాకపల్లి శ్రీను, వాకపల్లి వెంకటేశ్వరరావు, కడియం సందీప్ పోలిశెట్టి బాబులు, సుంకర బాబులు తదితరులు పాల్గొన్నారు.