ప్రభుత్వం నాడు-నేడు పేరుతో చేసిన నాసిరకమైన పనులకు ఫలితం!

భీమిలి నియోజకవర్గం, అర్చకునిపాలెం ప్రైమరీ స్కూల్ స్లాబ్ పెచ్చులు ఊడిపడి తీవ్ర గాయాలుపాలైన పాప వేద శ్రీ కుటుంబాన్ని భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల కలిసి ఆరోగ్యకరమైన ఆహారం, మందులకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ నాయకులు బి వి కృష్ణయ్య, శ్రీను బాబు, పద్మనాభం మండల నాయకులు సారధి, శివ కుమార్, సాయి, నారాయణ రావు, జనసైనికులు పాల్గొన్నారు.