ఎన్నికల ముందు గుర్తుకొచ్చిన రోడ్డు ఎన్నికల తర్వాత గుర్తు లేదా?

మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం మండలం నుండి వాయిలపల్లి రోడ్డు దుస్థితిపై మునుగోడు జనసేన నియోజకవర్గ కో ఆర్డినెటర్ గోకుల రవీందర్ రెడ్డి ఆద్వర్యంలో మంగళవారం నిరసనర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు గుర్తుకొచ్చిన రోడ్డు ఎన్నికల తర్వాత గుర్తు లేదా అని ప్రశ్నిస్తూ.. రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యేంతవరకు జనసేన పార్టీ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.