ఎస్సీ వర్గీకరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి
- ఎం.ఆర్.పి.ఎస్ నాయకులకు జనసేన పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది.
- దీక్షకు సంఘీభావం తెలిపిన జనగామ జనసేన పార్టీ నాయకులు వరంగల్ జిల్లా యువజన అధ్యక్షుడు ఆలేటి నరేందర్ గౌడ్..
జనగామ జిల్లాలోని చౌరస్తా ఆవరణలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జులై మూడున బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై చేసిన దాడిని ఖండిస్తూ ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ జనగామ జిల్లా ఇన్చార్జి ఇనుముల నరసయ్య గారి అధ్యక్షతన నిర్వహించిన దీక్షకు నేడు వారి దీక్షకు మద్దతుగా జనగామ జనసేన పార్టీ సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంద నాగరాజు, కేమిడీ జాని, గాద వెంకటేష్, గంధమల్ల అనిల్, బొట్ల రాకేష్ నాగరాజు, మంద పవన్ కుమార్, మంద వివేక్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-07-31-at-3.00.07-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-07-31-at-3.00.07-PM-1-1024x768.jpeg)