10న విజయవాడలో రెండో విడత జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం (10-7-22) ఉదయం 10గం.కు రెండో విడత జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం విజయవాడలో నిర్వహిస్తారు. శ్రీ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఉంటుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు నగర ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలను పవన్ కళ్యాణ్ సాయంత్రం 3గం. వరకూ స్వీకరిస్తారు. గత ఆదివారం చేపట్టిన తొలి విడత జనవాణిలో 427 అర్జీలు వచ్చాయి.