బాలీవుడ్ ఫై పడిన మరక త్వరలోనే పోతుంది: హేమమాలిని

బాలీవుడ్ ను డ్రగ్స్ వ్యవహారం రచ్చ చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు బయటకు రాగా ఈ డ్రగ్స్ అంశం పార్లమెంటులో సైతం చర్చకు వచ్చింది. లోక్ సభలో రవికిషన్, రాజ్యసభలో జయాబచ్చన్ దీనిపై తమతమ వాదనలు వినిపించారు. తాజాగా ఈ ఘటనపై సీనియర్ నటి హేమమాలిని స్పందించారు.

డ్రగ్స్ వ్యవహారంపై హేమమాలిని స్పందిస్తూ బాలీవుడ్ ఎప్పటికీ అత్యున్నత స్థాయిలోనే ఉంటుందని.. తనకున్న పేరు, ఖ్యాతి, గౌరవం, హోదా ఇవన్నీ సినీ పరిశ్రమ నుంచే వచ్చాయని చెప్పారు. అలాంటి ఇండస్ట్రీపై ఈరోజు ఇలాంటి విమర్శలు రావడం చాలా బాధిస్తోందని చెప్పారు. అందరికీ తాను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని… బాలీవుడ్ అనేది ఒక క్రియేటివ్ ప్రపంచమని… ఒక అందమైన ప్రదేశమని అన్నారు. అలాంటి బాలీవుడ్ గురించి ప్రజలు చెడుగా మాట్లాడుకోవడం బాధను కలిగిస్తోందని చెప్పారు. దేనిమీదైనా మరక పడినప్పుడు దాన్ని కడిగేస్తే పోతుందని… ఇప్పుడు బాలీవుడ్ మీద పడిన మరక కూడా త్వరలోనే పోతుందని అన్నారు.