మృత్యు కూపాల్లా తలపిస్తున్న రాష్ట్ర రహదారులు
కదిరి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న రహదారుల పరిస్థితిని రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులను నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వానికి తెలిసేలా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మాధ్యమాలు ద్వారా #GoodMorningCMSir అనే # టాగ్ ద్వారా తెలిపే క్రమంలో మన కదిరి నియోజకవర్గంలో కదిరి నుంచి రాయచోటి కి వెళ్ళే ప్రధాన రహదారి మధ్యలో ఒక పెద్ద గుంత ఏర్పడి రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. జులై 15 తేదీ లోపు రాష్ట్రంలో ఒక్క గుంత కూడా ఉండకూడదు అన్న జగన్ రెడ్డి మాటలకు కూడా విలువలేకుండా పోయింది.జన సేన పార్టీ అధినేత రాష్ట్ర రహదారుల పరిస్థితి గురించి మాట్లాడాడో హుటాహుటిన గుంతలను మట్టితో పూడ్చారు.పోనీ ఆ పనైనా సక్రమంగా చేశారా అంటే అది కూడా లేదు కుప్ప కుప్పలుగా వెయ్యడం వల్ల మరీ ఇబ్బంది కలుగుతోందని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు. ఈ క్రమంలో కదిరి జనసేన పార్టీ తరపున నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, ఐటీ వింగ్ కోఆర్డినేటర్ పొరకాల రాజేంద్ర, సోముశేఖర్, సాడగల గణేష్, చంద్రకాంత్, కార్తిక్, వంశీ తదితరులు పాల్గొనటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-15-at-5.46.36-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-15-at-5.46.35-PM-1024x462.jpeg)