రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి… బాదుడే…బాదుడు

*పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు, వంట గ్యాస్ ధరలు నిత్యావసర సరుకులు ధరలు వెంటనే తగ్గించాలని మాదాల శ్రీరాములు జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డిమాండ్

అరకువెలి నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు మాజీ ఎంపిటిసి సాయిబాబా అరకు మండల నాయకులు అల్లంగి రామకృష్ణ రాజ్ కుమార్ పెంచిన విద్యుత్ చార్జీలుపెట్రోల్డీజిల్గ్యాస్ ధరలు రాష్ట్రంలో మండిపోతున్నాయి పెరిగిన ధరలతో రాష్టంలో సామాన్యులు విలవిలాడుతున్నారు సామాన్యులు ఓటువేసిన పాపనికి ఇంత దారుణంగా ప్రజలపై నిత్యావసర సరుకులు రేట్లు పెంచి పేదవాడు కొనుక్కొని తినడానికి కూడా వీలు లేకుండా చేసారని జనాలు మండిపడుతున్నారు. ఈ సందర్భముగా మాదాల శ్రీరాములు మాట్లాడుతూ జనసేనపార్టీ అధినేత గౌ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు పోరాటం చేయాలని పిలుపిచ్చారు నేటి నుంచి పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు ప్రతి మండలం లో పోరాటం చేస్తాం అదేవిధంగా గ్రామస్థాయి నుండి విద్యుత్ చార్జీల మీద పోరాటం చేస్తాం. ప్రభత్వం పెంచిన చార్జీల మీద రేట్లు తగ్గించే దాకా మా పోరాటం ఆగదు అని ప్లకార్డు పట్టుకొని నిరసన తెలిపిన జనసేనపార్టీ అరకు మండలం నాయకులు శ్రీరాములు సాయిబాబా రామకృష్ణ రాజ్ కుమార్.