టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్రైజర్స్
ఐపీఎల్2020-13వ సీజన్లో మరో బిగ్ఫైట్ ఆరంభమైంది. 14వ లీగ్ మ్యాచ్లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగుతోంది. సన్రైజర్స్పై చెన్నైకి మంచి రికార్డు ఉంది. 2018 నుంచి హైదరాబాద్తో జరిగిన ఆరు మ్యాచ్లో చెన్నై టీమ్ ఐదింటిలో గెలుపొందింది. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విన్నింగ్ టీమ్నే కొనసాగిస్తున్నామని, తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని వార్నర్ తెలిపాడు. మరోవైపు చెన్నై టీమ్లో మూడు మార్పులు చేసినట్లు ధోనీ వెల్లడించాడు. మురళీ విజయ్, రుతురాజ్ గైక్వాడ్, హేజిల్వుడ్ స్థానంలో అంబటి రాయుడు, శార్దుల్ ఠాకూర్, డ్వేన్ బ్రావోలను తుది జట్టులోకి తీసుకున్నట్లు మహీ పేర్కొన్నాడు.