జనసైనికులు ఏర్పాటుచేసిన జెండా దిమ్మను ధ్వంసం చేసిన దుండగులు

ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలోని నరసాపురం గ్రామంలో జనసేనపార్టీ క్షేత్ర స్థాయిలో అభివృద్ధి చెందిన సందర్భంగా గ్రామంలో నేటి సాయంత్రం జెండా ఆవిష్కరణ కార్యక్రమం కొరకు జనసైనికులు ఏర్పాటుచేసిన జెండా దిమ్మను, ఓర్వలేని అధికార పార్టీ నాయకులు కొందరిని పంపి, ధ్వంసం చేయించారు. మీ వైసిపి నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడటం నిజంగా సిగ్గు చేటు.. మీ దిక్కుమాలిన దిగుజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది.