ఇంటింటికీ జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల త్రిశూల వ్యూహం

రాజానగరం, రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు, సిద్దాంతాలు ప్రజలకు చేరువ చేస్తూ, జనసేన-టిడిపి-బిజేపి కూటమి లక్ష్యాన్ని నెరవేర్చేలా, వైసిపి విముక్త రాజానగరం తీర్చిదిద్దేలా కోరుకొండ మండలం, ముగ్గళ్ల గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ, ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజా పరిపాలన తీసుకురావడానికి మన ఆశలకు, ఆకాంక్షలకు, సుపరిపాలనకు, రాజానగరం నియోజకవర్గం సమగ్రాభివృద్ధి చెందడానికి జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీలు (ఎన్.డి.ఏ కూటమి) బలపరచిన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తనకు ఒక అవకాశం ఇచ్చి, ఆశీర్వదించి, అఖండ మెజారిటీతో గెలిపించాలని రాజానగరం నియోజకవర్గ జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీలు బలపరచిన మన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కుమార్తెలు జనసేన పార్టీ వీరమహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి తోట ప్రత్యూషాదేవి, బత్తుల వందనాంబిక అభ్యర్దించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల పెద్దలు, నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.