ఇంటింటికీ జనసేన – టిడిపి – బీజేపీ పార్టీల త్రిశూల వ్యూహం

  • అడుగడుగునా జననీరాజనాలతో జోరుగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలు

రాజానగరం: రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు సిద్దాంతాలు ప్రజలకు చేరువచేస్తూ రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ.. ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ప్రజా పరిపాలన తీసుకురావడానికి.. మన ఆశలకు, ఆకాంక్షలకు వారధి రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి జనసేన – తెలుగుదేశం -బిజెపి పార్టీలు బలపరచిన మన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి అని అభ్యర్దించిన వారి కుమార్తె బత్తుల వందనాంబిక. ఈ కార్యక్రమంలో జనసేన- తెలుగుదేశం – బిజెపి పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.