బెదిరింపులు, దాడులతో భయపడేది లేదు

  • దాడి చేసిన వైసీపీ అనుచరులపై వెంటనే చర్యలు తీసుకోవాలి
  • జనసేన యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు

రాజంపేట, వైకాపా గుండాల బెదిరింపులు, దాడులతో భయపడేది లేదని రాజంపేట జనసేన పార్టీ యువ నాయకులు స్పష్టం చేశారు. రాజంపేట జనసేనపార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన యువ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, శుక్రవారం స్థానిక జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ… స్థానిక సమస్యలపై ప్రశ్నించినందుకు తిరుపతిలో జనసేన వీర మహిళపై దాడి చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రజల అభివృద్ధిపై దృష్టి సారించాలే కానీ ప్రశ్నించిన వారిపై దాడి చేయడం వైకాపా గుండాలకే చెల్లిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వైకాపా గుండా గాళ్ళకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. జనసేన మహిళలను బెదిరించాలని చూస్తే భయపడేది లేదని, వారి వెనక తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనే శక్తి స్వరూపం ఉందని తెలియజేశారు. స్థానిక సమస్యలపై ప్రశ్నిస్తే మహిళ ఇంటిపై దాడి చేసి అసభ్యకరమైన రీతిలో దూషించిన వైకాపా నాయకులకు సంస్కారం లేదని అన్నారు. తమ అధ్యక్షుడిని కాళీ చెప్పుతో పోల్చిన వైకాపా గుండాలు పవన్ కళ్యాణ్ కాలిగోటికి కూడా సరితూగరని హెచ్చరించారు. ఇంతటి అరాచకానికి పాల్పడిన వైసిపి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకొని తగిన శిక్ష పడేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భాస్కర్ పంతులు, తాళ్లపాక శంకరయ్య, చెంగల రాయుడు తదితరులు పాల్గొన్నారు.