పవన్ కళ్యాణ్ మాటల్లో నిజం ఉంది: కాంతి శ్రీ

  • వాలంటీర్ల భవిష్యత్తును కాపాడటానికే పవన్ కళ్యాణ్ కొంతమంది చేసిన తప్పులను ఎత్తి చూపారు

ఎచ్చెర్ల నియోజకవర్గం: వాలంటీర్ వ్యవస్థ మరియు కొంతమంది వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కొంతమంది వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వాఖ్యలను కొంతమంది వైసీపీ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాలంటీర్లను రెచ్చగొట్టి, పవన్ కళ్యాణ్ గారిపై, కుటుంబ సభ్యులను తిట్టిస్తూ పబ్బం గడుపుతున్నారని కాంతి శ్రీ వాపోయారు. డిగ్రీలు చదివిన వాళ్ళు ఇలా వాలంటీర్లుగా పనిచేయటం ఏంటని, పవన్ కళ్యాణ్ గారు మీ భవిష్యత్తును కాపాడటానికే కొంతమంది చేసిన తప్పులను ఎత్తి చూపారని తెలియజేశారు. రణస్థలం మండల అధ్యక్షులు గోవిందరెడ్డి మాట్లాడుతూ వాలంటీర్లకు వారిచ్చే 5000 వేతనంతో జీవితాలు పాడుచేసుకోవద్దని కోరారు. లావేరు మండల అధ్యక్షులు దుర్గారావు మాట్లాడుతూ.. వారాహి యాత్ర సక్సెస్ కావటంతో ఓర్వలేక వాలంటీర్లను వైసీపీ నాయకులు ఉసిగొల్పుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వడ్డాది శ్రీను, బలరాం, సూర్య, ఐటీ విభాగం కో-ఆర్డినేటర్ గొర్లె రాంబాబు, సూర్య, జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.