ఏపీ కేబినెట్ భేటీలో ఆమోదించిన అంశాలు ఇవే
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలకు ఆమోదం తెలిపారు.
కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే:
స్వరూపానందేంద్ర సరస్వతికి చెందిన విశాఖ శారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపు
జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్ కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపు
రాష్ట్రంలో ఐదు చోట్ల సెవెన్ స్టార్ పర్యాటక రిసార్ట్ ల ఏర్పాటుకు భూముల కేటాయింపు
పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు
వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటుకు ఆమోదం
రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం
సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు ఆమోదం
ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు (యూనిట్ రూ. 2.49 చొప్పున) ప్రతిపాదనకు ఆమోదం
బీసీ జనాభాను కులాలవారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం
విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ ప్రాజెక్టుకు ఆమోదం