అస్తవ్యస్తంగా పొగళ్లపల్లి తిమ్మంపేట రోడ్డు

  • పరిశీలించిన జనసేన నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, ములకలపల్లి నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో పొగల్లపల్లి తిమ్మంపేట మధ్య రోడ్డు అస్తవ్యస్తంగా మారటంతో జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్ళూరి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ సూచనలతో స్థానిక జనసేన నాయకులు పరిశీలించడం జరిగింది. ఈ విషయమై స్థానిక గ్రామ ప్రజలతో మాట్లాడగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు మార్గన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో గుంతల మైమయి, నిత్యం ఈ రోడ్డుమార్గంలో గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు మండల కేంద్రానికి ప్రయాణించాల్సి ఉండడంతో వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని, స్థానిక ప్రజా ప్రతినిధులుగాని ఆర్ అండ్ బి అధికారులుగాని, పంచాయతీరాజ్ శాఖ అధికారులుగాని, మండల అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవు అని గ్రామ ప్రజలు వాపోయారు. ఈ సందర్భంగా స్పందించిన జనసేన నాయకులు ఇట్టి విషయాన్ని స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యకు పరిష్కారానికి కృషి చేస్తామని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, మండల ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, మండల కార్యదర్శి మేక నరసింహారావు మరియు జిల్లా యువజన విద్యార్థి విభాగం నాయకులు గరికె రాంబాబు, గొల్ల వీరభద్రం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.