వ్యాపార దృక్పథంతో ఆలోచనవద్దు: నిర్మాత సురేష్

త్వరలోనే సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తుoడగా…ఆ దిశగా ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. దీనిపై ప్రముఖ నిర్మాత దగ్గుబాట సురేష్ స్పందించారు.

తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100కిపైగా థియేట‌ర్ల‌ను లీజుకు తీసుకున్న అగ్ర‌నిర్మాత సురేశ్ బాబు ఇప్ప‌డ‌ప్పుడే థియేట‌ర్ల‌ను రీఓపెన్ చేయడానికి సిద్ధంగా లేరు. ఇటువంటి సమయంలో థియేట‌ర్లు ఓపెన్ చేయ‌డం రిస్క్‌తో కూడిన ప‌ని. థియేట‌ర్ల‌లో 3 గంట‌ల‌పాటు ఉండి.. జీవితాల‌ను రిస్క్‌లో పెట్టే అవ‌కాశం ఉంటుంద‌ని, ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని సురేశ్ బాబు చెప్పుకొచ్చారు.

క‌రోనా కేసులు త‌గ్గిన త‌ర్వాత చైనాలో థియేట‌ర్లు ఓపెన్ చేశారు. కానీ వారు మ‌ళ్లీ థియేట‌ర్ల‌ను మూసివేశారు. దీన్ని మ‌న‌మంతా ఓ ఉదాహ‌ర‌ణగా తీసుకోవాల‌ని, వ్యాపార దృక్పథంతో ఆలోచించొద్దని కోరారు. ఇలాంటి సమయంలో ప్ర‌భుత్వం థియేట‌ర్లు రీఓపెన్ చేసుకునే అవ‌కాశ‌మిస్తుంద‌ని తాను అనుకోవ‌డం లేదని సురేశ్ బాబు అభిప్రాయపడ్డారు.