తిరుమల తిరపతి దేవస్థానం వారి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకి బాసటగా జనసేన నాయకులు

చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసు వారు అరెస్ట్ చేస్తున్నారని తెలియడంతో హుటా హుటిన జనసేన తిరుపతి నాయకులు మరియు జిల్లా నాయకులు కలిసి పోలీస్ వారికి ఎదురితిరిగి వాళ్ళ ఉద్యమానికి సంఘీబావం తెలిసి వారికి న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపటి సుభాషిణి, తిరుపతి టౌన్ ప్రెసిడెంట్ రాజారెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ రాజేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు పగడాల మురళి, A.K.శరవణ, జిల్లా కార్యదర్శి దేవర మనోహర, తిరుపతి నాయకులు బాబ్జీ, రాజేష్ పాల్గొన్నారు.