ఇంటింటికి జనసేన పార్టీ కార్యక్రమం 75 వ రోజు

  • బావరాజుపాలెం గ్రామంలో ఇంటింటికి జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తున్న కర్రిమజ్జి మల్లేశ్వరరావు

ఎచ్చెర్ల, శనివారం రణస్థలం మండలం బావరాజుపాలెం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రైతు కుటుంబాలను, కార్మిక కుటుంబాలను కలుసుకుని జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను వివరిస్తున్న పిఏసిఎస్ మాజీ చైర్మన్, జనసేన పార్టీ జిల్లానేత, ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు కర్రిమజ్జి మల్లేశ్వరరావు, లక్షల కోట్ల రూపాయిలు అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలంటే అది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని, నిబద్ధత, నిజాయితీ కలిగిన పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చెయ్యాల్సిన బాధ్యత ప్రజలదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, యెస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చాము, రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత మనమిదే ఉందని అన్నారు, ఆరు కోట్ల మంది ఆంధ్రుల జీవితాలకు మంచిచెయ్యాలనే సంకల్పమున్న ఏకైక నాయకుడు పవనన్న అని తెలియజేశారు, ఇళ్లల్లో ఉన్న మహిళలు, యువకులు విశేష స్పందనతో కర్రిమజ్జి మల్లేశ్వరరావుకు ఘనస్వాగతం పలికారు, ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.