ఈసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తాం: బత్తుల

  • చంద్రబాబుని చూసాం.. జగన్ ని చూసాం.. ఈసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తాం.. ఎవరినోట విన్నా ఇదే మాట: బత్తుల

రాజానగరం: జనం కోసం జనసేన మహాపాదయాత్ర కార్యక్రమం రాజానగరం నియోజకవర్గంలోని మూడు గ్రామాల్లో ఉదృతంగా, ఉత్సాహంగా ప్రజల ఆదరాభిమానులతో విజయవంతంగా సాగింది.. జనసేన నాయకులు జనసైనికులతో కలిసి విస్తృతంగా మూడు గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి.. కార్యక్రమంలో భాగంగా సోమవారం మునగాల, నాగంపల్లి, మరియు ఆకరిగా బోల్లెద్దుపాలెం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రతి గడప ఎక్కుతూ, ప్రతి ఒక్కరిని కలుస్తూ… జనసేన పార్టీకి ఓటు వెయ్యాలని బత్తుల దంపతులు అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయాగ్రామాల్లో ప్రజలు.. చంద్రబాబును చూశాం, జగన్ ని చూసాం, ఈసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తామని వారు స్వచ్ఛందంగా చెప్పడం పాదయాత్ర శిబిరం జనశ్రేణుల్లో మిక్కిలి సంతోషాన్ని కలిగించింది.. రాత్రి 10 గంటల వరకు ఉధృతంగా కొనసాగిన ఈ మహాపాదయాత్ర లో సీనియర్ జనసేన నేతలు, జనసైనికులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.