నాసిరకం రోడ్డు నిర్మాణానికి కారకులను శిక్షించాలి: సుంకెట మహేష్

  • నడి రోడ్డు మీద గుంత పడితే ప్రాణాలు గోవిందా

భైంసా నియోజకవర్గం: భైంసా మండలంలోని వానల్ పాడ్ నుండి సుంక్లి కి వెళ్ళే రోడ్ మార్గం పూర్తిగా చెడిపోతుంది. గతంలో ఈ రోడ్ బాగు చేయాలని పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా రోడ్డు వేశారు. కాని ఏమి లాభం? కనీసం ఒక్క సంవత్సరం కూడా కాలేదు నాసిరకం రోడ్డు వేయడం వల్ల రోడ్డు నడి మధ్యలో పెద్ద గుంత పడింది. రోడ్డు మీద కంకర తేలుతుంది. దీనికి కారణం రోడ్డు భద్రత రవాణా శాఖ అధికారులు, మరియు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ దోపిడీకి నిలువెత్తు నిదర్శనం కనపడుతుంది. దీనిని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే గుంతను పూడ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.