విద్యార్థిని మృతికి కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలి..

  • జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు

భైంసా: సారంగాపూర్ మండల జామ్ బాలికల వసతి గృహంలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని మృతికి కారణమైన వారిని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు డిమాండ్ చేసారు. సుంకెట మహేష్ మాట్లాడుతూ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించే సమయంలో పిల్లల ఆరోగ్య పరిస్తితి తెలుసుకొని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో క్రీడలు చేయాలి. కాని ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం కారణంగా అమాయక విద్యార్థిని ప్రాణం బలి అయ్యింది. వసతి గృహంలో అధికారుల పర్యవేక్షణ బాధ్యతలను పూర్తిగా విస్మరించారు. ప్రభుత్వం కూడా వసతి గృహలపై నిర్లక్ష్యంగా వున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అద్దె భవనాలు, భోజనాలు, వసతుల్లో లోపాలు కనపడుతున్న పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే విద్య వ్యవస్థలో మెరుగైన విద్య, వసతులు, కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల ప్రభుత్వం మెడలు వంచే విధంగా పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.