ఎమ్మెల్సీలుగా ముగ్గురి ప్రమాణం
తెలంగాణ శాసన మండలికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, గోరెటి వెంకన్న, బొగ్గారపు దయానంద్ ల చేత శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు స్థానాల కోసం కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్రావు తదితరుల పేర్లు వినిపించాయ్. అయితే సీఎం కేసీర్ గోరేటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ పేర్లని ఖరారు చేశారు.