కెపిహెచ్బి ఆరోగ్య ఉపకేంద్రానికి కుర్చీలను అందించిన తుమ్మల

కూకట్‌పల్లి: కెపిహెచ్బి కాలనీ 114 డివిజన్ ఉన్న ఆరోగ్య ఉపకేంద్రం నిర్వాహకరాలు రమాదేవికి కూకట్పల్లి జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ 10 కుర్చీలను ఉచితంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల మోహన్ కుమార్ మాట్లాడుతూ.. ఆరోగ్య ఉపకేంద్రానికి సుమారుగా ప్రతిరోజు 30 నుంచి వస్తుంటారని మరియు బుధవారం రోజు చిన్నపిల్లలకు టీకాలు వేయించుకునేందుకు సుమారుగా 100 నుంచి 150 వరకూ వస్తుంటారని, వారికి కూర్చుంటానికి ఈ ఆరోగ్య కేంద్రంలో కుర్చీలు లేక చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యాన్ని చూసి చెల్లించి మానవత్వంతో ఈ 10 కుర్చీలను ఇవ్వటం జరిగినది అని అన్నారు.